Random Video

TDP Chief Chandrababu Naidu Serious On CM Jagan || ఇసుక కొరత గురించి జగన్ పై మండిపడ్డ చంద్రబాబు

2019-11-02 451 Dailymotion

Chandra Babu serious on Cm Jagan on his failure in solve the sand problem. In guntur dist building worker committed s@@@de with financial problems. All opposition parties targetting YCP govt in this matter.
#chandrababu
#cmjagan
#tdp
#ysrcp
#sandcrisis
#buildingworkers
#amaravathi
#vijyawada


ముఖ్యమంత్రి జగన్ పై ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేతల ఇసుక దోపిడీకి మరో కార్మికుడు ప్రాణం బలిగొందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. గుంటూరులో తాపీమేస్త్రీ ఆత్మహత్య కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో 10 మంది కార్మికులు మృతిచెందారని చెప్పారు. ఆదుకోవాల్సిన పాలకులు అపహాస్యం చేయడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుల బాధ్యతారాహిత్యానికి ఇంకెంత మంది బలికావాలని నిలదీసారు. ఈ రోజు గుంటూరు జిల్లాలోల ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నట్లుగా కధనాలు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఇదే విధంగా ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు టీడీపీ అధినేత పార్టీ నుండి లక్ష రూపాయల చొప్పున ఆర్దిక సాయం అందించారు.